సంఖ్యాకాండం
26 తెగులు తర్వాత+ యెహోవా మోషేతో, అలాగే యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుతో ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయుల సమాజమంతటిలో వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాల్ని బట్టి 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్ల జనాభా లెక్క సేకరించు; ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలిగే వాళ్లందర్నీ లెక్కపెట్టు.”+ 3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో+ దగ్గర యొర్దాను తీరాన ఉన్న మోయాబు ఎడారి మైదానాల్లో+ ప్రజలతో ఇలా అన్నారు: 4 “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే మీరు 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్లందరి జనాభా లెక్క సేకరించండి.”+
ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలు కుమారులు ఎవరంటే: 5 ఇశ్రాయేలు మొదటి కుమారుడు రూబేను.+ రూబేను వంశస్థులు+ వీళ్లు: హనోకు నుండి వచ్చిన హనోకీయులు; పల్లు నుండి వచ్చిన పల్లువీయులు; 6 హెస్రోను నుండి వచ్చిన హెస్రోనీయులు; కర్మీ నుండి వచ్చిన కర్మీయులు. 7 వీళ్లు రూబేను వంశస్థులు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 43,730.+
8 పల్లు కుమారుడు ఏలీయాబు. 9 ఏలీయాబు కుమారులు వీళ్లు: నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములు సమాజంలో ఎంచుకోబడినవాళ్లు; కోరహు గుంపు యెహోవా మీద తిరగబడినప్పుడు+ వాళ్లతో కలిసి మోషే, అహరోనులకు ఎదురుతిరిగింది వీళ్లే.
10 అప్పుడు భూమి నోరు తెరిచి వాళ్లను మింగేసింది. అయితే కోరహు మాత్రం, అగ్ని దిగివచ్చి 250 మందిని దహించేసినప్పుడు తన మద్దతుదారులతో పాటు చనిపోయాడు.+ వాళ్లు ఒక హెచ్చరికగా ఉన్నారు.+ 11 అయితే కోరహు కుమారులు చనిపోలేదు.+
12 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం షిమ్యోను వంశస్థులు+ వీళ్లు: నెమూయేలు నుండి వచ్చిన నెమూయేలీయులు; యామీను నుండి వచ్చిన యామీనీయులు; యాకీను నుండి వచ్చిన యాకీనీయులు; 13 జెరహు నుండి వచ్చిన జెరహీయులు; షావూలు నుండి వచ్చిన షావూలీయులు. 14 వీళ్లంతా షిమ్యోను వంశస్థులు, వీళ్ల సంఖ్య 22,200.+
15 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం గాదు వంశస్థులు+ వీళ్లు: సెపోను నుండి వచ్చిన సెపోనీయులు; హగ్గీ నుండి వచ్చిన హగ్గీయులు; షూనీ నుండి వచ్చిన షూనీయులు; 16 ఓజని నుండి వచ్చిన ఓజనీయులు; ఏరీ నుండి వచ్చిన ఏరీయులు; 17 ఆరోదు నుండి వచ్చిన ఆరోదీయులు; అరేలీ నుండి వచ్చిన అరేలీయులు. 18 ఇవి గాదు వంశస్థుల కుటుంబాలు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 40,500.+
19 యూదా కుమారులు+ ఏరు, ఓనాను.+ అయితే ఏరు, ఓనానులు కనాను దేశంలోనే చనిపోయారు.+ 20 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం యూదా వంశస్థులు వీళ్లు: షేలహు+ నుండి వచ్చిన షేలహీయులు; పెరెసు+ నుండి వచ్చిన పెరెసీయులు; జెరహు+ నుండి వచ్చిన జెరహీయులు. 21 పెరెసు కుమారులు వీళ్లు: ఎస్రోను+ నుండి వచ్చిన ఎస్రోనీయులు; హామూలు నుండి వచ్చిన హామూలీయులు. 22 వీళ్లు యూదా కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 76,500.+
23 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఇశ్శాఖారు వంశస్థులు+ వీళ్లు: తోలా+ నుండి వచ్చిన తోలాహీయులు; పువ్వా నుండి వచ్చిన పువ్వీయులు; 24 యాషూబు నుండి వచ్చిన యాషూబీయులు; షిమ్రోను నుండి వచ్చిన షిమ్రోనీయులు. 25 వీళ్లు ఇశ్శాఖారు కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 64,300.+
26 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం జెబూలూను వంశస్థులు+ వీళ్లు: సెరెదు నుండి వచ్చిన సెరెదీయులు; ఏలోను నుండి వచ్చిన ఏలోనీయులు; యహలేలు నుండి వచ్చిన యహలేలీయులు. 27 వీళ్లు జెబూలూను కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 60,500.+
28 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం యోసేపు కుమారులు+ వీళ్లు: మనష్షే, ఎఫ్రాయిము.+ 29 మనష్షే+ వంశస్థులు వీళ్లు: మాకీరు+ నుండి వచ్చిన మాకీరీయులు; మాకీరు గిలాదును కన్నాడు;+ గిలాదు నుండి గిలాదీయులు వచ్చారు. 30 గిలాదు వంశస్థులు వీళ్లు: ఈజరు నుండి వచ్చిన ఈజరీయులు; హెలెకు నుండి వచ్చిన హెలెకీయులు; 31 అశ్రీయేలు నుండి వచ్చిన అశ్రీయేలీయులు; షెకెము నుండి వచ్చిన షెకెమీయులు; 32 షెమీదా నుండి వచ్చిన షెమీదాయీయులు; హెపెరు నుండి వచ్చిన హెపెరీయులు. 33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కూతుళ్లు తప్ప కుమారులు లేరు.+ అతని కూతుళ్ల పేర్లు ఏమిటంటే: మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 34 వీళ్లు మనష్షే కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 52,700.+
35 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఎఫ్రాయిము+ వంశస్థులు వీళ్లు: షూతలహు+ నుండి వచ్చిన షూతలహీయులు; బేకెరు నుండి వచ్చిన బేకెరీయులు; తహను నుండి వచ్చిన తహనీయులు. 36 షూతలహు వంశస్థులు వీళ్లు: ఏరాను నుండి వచ్చిన ఏరానీయులు. 37 వీళ్లు ఎఫ్రాయిము కుమారుల కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 32,500.+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం యోసేపు వంశస్థులు వీళ్లు.
38 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం బెన్యామీను వంశస్థులు+ వీళ్లు: బెల+ నుండి వచ్చిన బెలీయులు; అష్బేలు నుండి వచ్చిన అష్బేలీయులు; అహీరాము నుండి వచ్చిన అహీరామీయులు; 39 షూపాము నుండి వచ్చిన షూపామీయులు; హుప్పం నుండి వచ్చిన హుప్పమీయులు. 40 బెల కుమారులైన ఆర్దు, నయమాను+ వంశస్థులు వీళ్లు: ఆర్దు నుండి వచ్చిన ఆర్దీయులు; నయమాను నుండి వచ్చిన నయమానీయులు. 41 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం బెన్యామీను వంశస్థులు వీళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 45,600.+
42 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం దాను వంశస్థులు+ వీళ్లు: షూషాము నుండి వచ్చిన షూషామీయులు. వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం దాను కుటుంబాల వాళ్లు వీళ్లు. 43 షూషాము కుటుంబాలన్నిట్లో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 64,400.+
44 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఆషేరు వంశస్థులు+ వీళ్లు: ఇమ్నా నుండి వచ్చిన ఇమ్నీయులు; ఇష్వీ నుండి వచ్చిన ఇష్వీయులు; బెరీయా నుండి వచ్చిన బెరీయులు. 45 బెరీయా వంశంవాళ్లు వీళ్లు: హెబెరు నుండి వచ్చిన హెబెరీయులు; మల్కీయేలు నుండి వచ్చిన మల్కీయేలీయులు. 46 ఆషేరు కూతురి పేరు శెరహు. 47 వీళ్లు ఆషేరు వంశస్థుల కుటుంబాల వాళ్లు, వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 53,400.+
48 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం నఫ్తాలి వంశస్థులు+ వీళ్లు: యహసేలు నుండి వచ్చిన యహసేలీయులు; గూనీ నుండి వచ్చిన గూనీయులు; 49 యేసెరు నుండి వచ్చిన యేసెరీయులు; షిల్లేము నుండి వచ్చిన షిల్లేమీయులు. 50 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం నఫ్తాలి కుటుంబాల వాళ్లు వీళ్లు. వీళ్లలో పేరు నమోదైనవాళ్ల సంఖ్య 45,400.+
51 ఇశ్రాయేలీయుల్లో పేరు నమోదైనవాళ్ల మొత్తం సంఖ్య 6,01,730.+
52 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 53 “ఈ పేర్ల జాబితా ప్రకారం* వీళ్లకు నువ్వు దేశాన్ని స్వాస్థ్యంగా పంచి ఇవ్వాలి.+ 54 పెద్ద గుంపులకు ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి, చిన్న గుంపులకు తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. ఒక్కో గుంపుకు వచ్చే స్వాస్థ్యం, దానిలో పేరు నమోదైనవాళ్ల సంఖ్యకు తగినట్టు ఉండాలి. 55 అయితే భూమిని చీట్లు* వేసి పంచాలి.+ వాళ్లవాళ్ల పూర్వీకుల గోత్రాల పేర్ల ప్రకారం వాళ్లకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. 56 ఒక్కో స్వాస్థ్యాన్ని చీట్లు వేసి నిర్ణయించాలి; ఒక గుంపు ఎంత పెద్దది లేదా ఎంత చిన్నది అనేదాన్ని బట్టి భూమిని పంచి ఇవ్వాలి.”
57 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం లేవీయుల్లో పేరు నమోదైనవాళ్లు వీళ్లు: గెర్షోను నుండి వచ్చిన గెర్షోనీయులు; కహాతు+ నుండి వచ్చిన కహాతీయులు; మెరారి నుండి వచ్చిన మెరారీయులు. 58 వీళ్లు లేవీయుల కుటుంబాల వాళ్లు: లిబ్నీయులు,+ హెబ్రోనీయులు,+ మహలీయులు,+ మూషీయులు,+ కోరహీయులు.+
కహాతు అమ్రామును కన్నాడు.+ 59 అమ్రాము భార్య పేరు యోకెబెదు,+ ఆమె లేవి కూతురు; లేవి భార్య ఐగుప్తులో ఆమెను కన్నది. యోకెబెదు అమ్రాముకు అహరోనును, మోషేను, వాళ్ల సహోదరి మిర్యామును కన్నది.+ 60 అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.+ 61 అయితే నాదాబు, అబీహులు యెహోవా ఆజ్ఞాపించని వేరే అగ్నితో ధూపం వేయడం వల్ల ఆయన ముందు చనిపోయారు.+
62 వాళ్లలో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి పేరు నమోదైన మగవాళ్లందరి సంఖ్య 23,000.+ వీళ్లకు ఇశ్రాయేలీయుల మధ్య ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వబడదు+ కాబట్టి వీళ్లను ఇశ్రాయేలీయులతో పాటు నమోదు చేయలేదు.+
63 యెరికో దగ్గర యొర్దాను తీరాన ఉన్న మోయాబు ఎడారి మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలీయుల్ని నమోదు చేసినప్పుడు తమ పేరు నమోదైనవాళ్లు వీళ్లే. 64 అయితే సీనాయి ఎడారిలో మోషే, యాజకుడైన అహరోను సేకరించిన జనాభా లెక్కలో పేరు నమోదైన ఇశ్రాయేలీయుల్లో ఒక్కరు కూడా వీళ్లలో లేరు.+ 65 ఎందుకంటే, “వీళ్లు ఖచ్చితంగా ఎడారిలో చనిపోతారు” అని యెహోవా వాళ్ల గురించి చెప్పాడు.+ కాబట్టి యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప వాళ్లలో ఒక్కరు కూడా మిగల్లేదు.+