కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 73 పేజీ 172-పేజీ 173 పేరా 2
  • యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన మెస్సీయకు అగ్రగామి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బాప్తిస్మమిచ్చే యోహాను మార్గాన్ని సిద్ధం చేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు మెస్సీయ అయ్యాడు
    నా బైబిలు పుస్తకం
  • యోహాను మార్గమును సరాళము చేయును
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 73 పేజీ 172-పేజీ 173 పేరా 2
యొర్దాను నది ఒడ్డున బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రజలకు నేర్పిస్తున్నాడు

లెసన్‌ 73

యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు

జెకర్యా, ఎలీసబెతుకు పుట్టిన యోహాను, పెద్దయ్యాక ప్రవక్త అయ్యాడు. మెస్సీయ వస్తున్నాడని ప్రజలకు నేర్పించడానికి యెహోవా యోహానును ఉపయోగించాడు. పట్టణాల్లో, సమాజమందిరాల్లో నేర్పించే బదులు యోహాను ఎడారిలో ప్రకటించాడు. యోహాను దగ్గర నేర్చుకోవడానికి ప్రజలు యెరూషలేమును నుండి, యూదయ ప్రాంతమంతటి నుండి వచ్చారు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే చెడు పనులు చేయడం మానేయాలని ఆయన వాళ్లకు నేర్పించాడు. యోహాను చెప్పింది విని చాలామంది వాళ్ల పాపాలు మానుకున్నారు. యోహాను వాళ్లకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు.

యోహాను చాలా మామూలుగా జీవించేవాడు. ఆయన ఒంటె జుట్టుతో చేసిన బట్టలు వేసుకునేవాడు. మిడతలు, అడవి తేనె తినేవాడు. అందరికీ యోహాను గురించి తెలుసుకోవాలని ఉండేది. పొగరుబోతులైన పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ఆయనిని చూడడానికి వచ్చేవాళ్లు. యోహాను వాళ్లతో ఇలా అన్నాడు: ‘మీరు మీ పద్ధతిని మార్చుకుని, పశ్చాత్తాపపడాలి. మీరు అబ్రాహాము పిల్లలు అని చెప్పుకున్నంత మాత్రాన మీరు ప్రత్యేకమైన వాళ్లని అనుకోకండి. మీరు దేవుని పిల్లలు అని అనుకోకండి.’

చాలామంది యోహాను దగ్గరకు వచ్చి ఇలా అడిగారు: ‘దేవునికి ఇష్టంగా ఉండాలంటే మేము ఏం చేయాలి?’ యోహాను యూదులకు ఇలా జవాబిచ్చాడు: ‘మీ దగ్గర రెండు అంగీలు ఉంటే, అవసరంలో ఉన్న వాళ్లకు ఒకటి ఇచ్చేయండి.’ ఆయన అలా ఎందుకు చెప్పాడో మీకు తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే, ప్రజలను ప్రేమించాలని తన శిష్యులకు నేర్పించాలనుకున్నాడు.

పన్నులు వసూలు చేసేవాళ్లతో యోహాను ఇలా అన్నాడు: ‘నిజాయితీగా ఉండండి. ఎవ్వరినీ మోసం చేయకండి.’ సైనికులతో ఇలా చెప్పాడు: ‘లంచాలు తీసుకోకండి, అబద్ధాలు చెప్పకండి.’

యాజకులు, లేవీయులు కూడా యోహాను దగ్గరకు వచ్చి ఇలా అడిగారు: ‘నువ్వు ఎవరివి? అందరికీ తెలుసుకోవాలనుంది.’ యోహాను ఇలా అన్నాడు: ‘యెషయా ప్రవచించినట్లు నేను ఎడారిలో ఒక స్వరాన్ని. ప్రజల్ని యెహోవా దగ్గరికి నడిపిస్తున్నాను.’

యోహాను నేర్పించేవాటిని ప్రజలు ప్రేమించారు. చాలామంది యోహాను మెస్సీయ అయ్యుంటాడా అని అనుకున్నారు. కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: ‘చాలా గొప్ప అతను ఒకరు వస్తున్నారు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోను. నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పవిత్రశక్తితో బాప్తిస్మం ఇస్తాడు.’

“అతని ద్వారా అన్నిరకాల ప్రజలు నమ్మకముంచేలా, అతను ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఒక సాక్షిగా వచ్చాడు.”—యోహాను 1:7

ప్రశ్నలు: యెహోవా యోహానును ప్రజల దగ్గరకు ఎందుకు పంపించాడు? వాళ్లు ఆయన చెప్పిన విషయాలకు ఎలా స్పందించారు?

మత్తయి 3:1-11; మార్కు 1:1-8; లూకా 3:1-18; యోహాను 1:19-28; యెషయా 40:3

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి