దైవపరిపాలనా వార్తలు
బెనిన్: ఏప్రిల్ రిపోర్టు ప్రకారము 2,793 మంది ప్రచారకులు 4,442 బైబిలు పఠనములను నిర్వహించి, 30,814 పునర్దర్శనములను చేశారు. ఈ సంఖ్యలు మూడు క్రొత్త శిఖరాలను సూచిస్తున్నవి.
బల్గేరియా: కేవలం ఒక సంవత్సరములో ప్రచారకుల సంఖ్య మార్చిలో 107 నుండి 218కి పెరిగింది. అది 104 శాతము అభివృద్ధి. ప్రచారకులు సగటున 19.7 గంటలను ప్రాంతీయసేవలో గడిపి, 585 గృహ బైబిలు పఠనములను నిర్వహించారు. వారి మొదటి ప్రత్యేక సమావేశ దినము మార్చిలో జరిగినది, దానికి 900 మంది హాజరయ్యారు.
జెకొస్లోవాకియా: క్రొత్తశిఖరంగా 25,111 మంది ప్రచారకులు మార్చిలో రిపోర్టుచేశారు. ఇది గత సంవత్సరపు సగటుపై 9-శాతము అభివృద్ధి.
ఈక్వెడార్: ఈ సంవత్సరం జ్ఞాపకార్థ దినపు హాజరు 99,987. ఏప్రిల్ మాసములో 21,734 మంది ప్రచారకుల శిఖరముతో, అభివృద్ధి కొనసాగుతుందని ఆశించబడుతుంది.
నికరాగ్వా: ఏప్రిల్లో నిజానికి రాజ్యసేవయొక్క ప్రతిరంగమందు క్రొత్తశిఖరాలు చేరుకోబడినవి. జ్ఞాపకార్థ దినపు హాజరు ఆ నెలకు చేరుకొనిన 9,629 ప్రచారకుల సంఖ్యకు ఐదు రెట్లు ఎక్కువున్నది.