దైవపరిపాలనా వార్తలు
◼ పశ్చిమ ఆఫ్రికా దేశాలైన కామెరూన్, కోటె డి ఐవరీ, ఘానా, నైజీరియా, బెనిన్, లైబీరియాలు ఫిబ్రవరిలో ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకున్నాయి.
◼ అనేకమంది శరణార్థులు లైబీరియాకు తిరిగి వస్తున్నారు, ఆ దేశ ప్రజలు సత్యం కోసం నిజంగా పరితపించిపోతున్నారు. ఫిబ్రవరి నెలలో శిఖరాగ్ర సంఖ్యయైన 2,286 మంది ప్రచారకులు 6,277 గృహ బైబిలు పఠనాల్ని రిపోర్టు చేశారు.
◼ మకావోలో గత సంవత్సరపు సగటుతో పోల్చిచూస్తే, ఈ సంవత్సరం ప్రచారకులలో 16 శాతం పెరుగుదల ఉంది, ఫిబ్రవరిలో 135 మంది రిపోర్టు చేశారు.
◼ ఫిబ్రవరి నెలలో దక్షిణ ఫసిపిక్, టాహిటి, ఫిజీ, సాలమన్ దీవులు ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలను రిపోర్టు చేశాయి.
◼ మడగాస్కర్ దీవి 9,484 ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొంది, అది గత సంవత్సరపు సగటుకన్నా 14-శాతం ఎక్కువ. వాళ్లు ఫిబ్రవరిలో 20,000 కన్నా ఎక్కువ గృహ బైబిలు పఠనాల్ని రిపోర్టు చేశారు.