జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు
జ్ఞాపకార్థ ఆచరణ, ఈ సంవత్సరం మార్చి 28, గురువారంనాడు జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాలపై శ్రద్ధ కనబరచాలి:
◼ కూటాన్ని నిర్వహించే సమయాన్ని నిర్ణయించేటప్పుడు, చిహ్నాలు సూర్యాస్తమయానికి ముందుగా అందించకుండా ఉండేలా నిశ్చయపరచుకోవాలి.
◼ ఈ ఆచరణ జరిగే ఖచ్చితమైన సమయాన్నీ, స్థలాన్నీ ప్రసంగీకునితోపాటు అందరికీ తెలియజేయాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకు తగిన రొట్టెనూ, ద్రాక్షారసాన్నీ సంపాదించి, సిద్ధంగా ఉండేలా చూడాలి.—కావలికోట ఫిబ్రవరి 15, 1985 (ఆంగ్లం), 19వ పేజీ చూడండి.
◼ ప్లేట్లనూ, గ్లాసులనూ, తగిన టేబుల్నీ, టేబుల్క్లాత్నీ ఆచరణ జరిగే హాలుకు ముందుగానే తీసుకొచ్చి, వాటికి కేటాయించబడిన స్థలంలో ఉంచాలి.
◼ ఈ కూటం జరిగే స్థలాన్ని, అది రాజ్యమందిరమే అయినా, లేక మరో చోటైనా సరే, ఎంతో ముందుగానే బాగా శుభ్రపరచాలి.
◼ అటెండెంట్లనూ, చిహ్నాలనూ అందించే వారినీ ఎంపికచేసుకొని వాళ్లు అనుసరించవలసిన సరియైన పద్ధతిని గురించీ, వాళ్లు నిర్వహించవలసిన పనుల గురించీ, మర్యాదకరమైన వస్త్రధారణ, కేశాలంకరణల అవసరత గురించీ ముందుగానే ఉపదేశించాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరుకాలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాలను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకునేందుకు షెడ్యూలు వేయబడితే, వరండాలోనూ, ప్రవేశ మార్గాల్లోనూ, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసరమైన రద్దీలేకుండా జాగ్రత్త పడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.