కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?
    కావలికోట—2010 | ఆగస్టు 15
    • దేవుని కోపం నుండి కాపాడబడ్డాం

      4, 5. ప్రస్తుత దుష్ట విధానంపై యెహోవా కోపం నిలిచివుందని ఏది చూపిస్తోంది?

      4 ఆదాము పాపం చేసినప్పటినుండి దేవుని కోపం మానవులపై ‘నిలిచి ఉందని’ బైబిలు, మానవ చరిత్ర చూపిస్తున్నాయి. (యోహా. 3:36) ఇప్పటివరకు ఏ మానవుడూ చావును తప్పించుకోలేకపోతున్నాడనే విషయాన్ని బట్టి అది స్పష్టమౌతోంది. ఎప్పటి నుండో సంభవిస్తూ వస్తున్న విపత్తుల నుండి మానవులను రక్షించడంలో దేవుని ప్రత్యర్థియైన సాతాను పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఏ మానవ ప్రభుత్వమూ దాని పౌరుల కనీస అవసరాలను తీర్చలేకపోయింది. (1 యోహా. 5:19) అందుకే యుద్ధాలు, నేరాలు, పేదరికం వంటివి మానవుల్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి.

  • విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?
    కావలికోట—2010 | ఆగస్టు 15
    • 7 ‘రాబోయే ఉగ్రతనుండి’ యేసు ‘మనల్ని తప్పిస్తాడని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 థెస్స. 1:9, 10) పశ్చాత్తాపపడని పాపుల మీద యెహోవా చివరిసారి తన కోపాన్ని వెళ్లగ్రక్కినప్పుడు వారు నిత్య నాశనాన్ని పొందుతారు. (2 థెస్స. 1:6-9) మరి ఆ ఉగ్రతను ఎవరు తప్పించుకుంటారు? బైబిలు ఇలా చెబుతోంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహా. 3:36) ఈ విధానం నాశనమయ్యే సమయానికి సజీవంగా ఉండి యేసుపట్ల, ఆయన అర్పించిన విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని కనబరచినవారు దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి