-
విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?కావలికోట—2010 | ఆగస్టు 15
-
-
దేవుని కోపం నుండి కాపాడబడ్డాం
4, 5. ప్రస్తుత దుష్ట విధానంపై యెహోవా కోపం నిలిచివుందని ఏది చూపిస్తోంది?
4 ఆదాము పాపం చేసినప్పటినుండి దేవుని కోపం మానవులపై ‘నిలిచి ఉందని’ బైబిలు, మానవ చరిత్ర చూపిస్తున్నాయి. (యోహా. 3:36) ఇప్పటివరకు ఏ మానవుడూ చావును తప్పించుకోలేకపోతున్నాడనే విషయాన్ని బట్టి అది స్పష్టమౌతోంది. ఎప్పటి నుండో సంభవిస్తూ వస్తున్న విపత్తుల నుండి మానవులను రక్షించడంలో దేవుని ప్రత్యర్థియైన సాతాను పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఏ మానవ ప్రభుత్వమూ దాని పౌరుల కనీస అవసరాలను తీర్చలేకపోయింది. (1 యోహా. 5:19) అందుకే యుద్ధాలు, నేరాలు, పేదరికం వంటివి మానవుల్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి.
-
-
విమోచన క్రయధనం మనల్ని ఎలా రక్షిస్తుంది?కావలికోట—2010 | ఆగస్టు 15
-
-
7 ‘రాబోయే ఉగ్రతనుండి’ యేసు ‘మనల్ని తప్పిస్తాడని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 థెస్స. 1:9, 10) పశ్చాత్తాపపడని పాపుల మీద యెహోవా చివరిసారి తన కోపాన్ని వెళ్లగ్రక్కినప్పుడు వారు నిత్య నాశనాన్ని పొందుతారు. (2 థెస్స. 1:6-9) మరి ఆ ఉగ్రతను ఎవరు తప్పించుకుంటారు? బైబిలు ఇలా చెబుతోంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహా. 3:36) ఈ విధానం నాశనమయ్యే సమయానికి సజీవంగా ఉండి యేసుపట్ల, ఆయన అర్పించిన విమోచన క్రయధనం పట్ల విశ్వాసాన్ని కనబరచినవారు దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు.
-