-
మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడుకావలికోట—1997 | అక్టోబరు 15
-
-
5. మనమందరం పరిచర్యలో సమానమైన మొత్తాన్ని చేయనవసరం లేదని అపొస్తలుల ఉదాహరణ ఎలా చూపిస్తుంది?
5 మనస్ఫూర్తిగా చేయడం అంటే మనమందరం పరిచర్యలో సమానమైన మొత్తాన్ని చేయడమని అర్థమా? అది అసంభవం, ఎందుకంటే పరిస్థితులూ, సామర్థ్యాలు వ్యక్తి వ్యక్తికీ మారుతుంటాయి. విశ్వసనీయులైన యేసు అపొస్తలులను పరిగణనలోనికి తీసుకోండి. వారందరికీ సమానమైన మొత్తాన్ని చేసే సామర్థ్యం లేదు. ఉదాహరణకు, కొంతమంది అపొస్తలుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. అటువంటి వారిలో కనానీయుడైన సీమోను, అల్ఫయి కుమారుడైన యాకోబు ఉన్నారు. బహుశ అపొస్తలులుగా వారి కార్యకాలాపాలు బాగా పరిమితమై ఉండివుండవచ్చు. (మత్తయి 10:2-4) అందుకు భిన్నంగా, పేతురు బరువైన బాధ్యతల్ని ఎన్నింటినో చేపట్టగలిగాడు—అంతెందుకు, యేసు ఆయనకు “పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు” ఇచ్చాడు కూడా! (మత్తయి 16:19) అయినా, పేతురు ఇతరులకు పైగా ఉన్నతపర్చబడలేదు. యోహాను ప్రకటనలో నూతన యెరూషలేము యొక్క దర్శనాన్ని పొందినప్పుడు (దాదాపు సా.శ. 96లో), ఆయన 12 పునాదులను చూశాడు, వాటిపైన “పన్నిద్దరు అపొస్తలుల పేళ్లు” చెక్కబడివున్నాయి.a (ప్రకటన 21:14) యెహోవా, అపొస్తలులందరి సేవను విలువైందిగా ఎంచాడు, చివరికి వారిలో కొందరు స్పష్టంగానే ఇతరుల కన్నా ఎక్కువ చేయగల్గినప్పటికీ కూడా.
-
-
మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడుకావలికోట—1997 | అక్టోబరు 15
-
-
a యూదా స్థానాన్ని మత్తీయ భర్తీ చేసినందున, ఆయన పేరు—పౌలు పేరు కాదు—12 పునాదులమీదనున్న పేర్లలో ఒకటిగా కనబడివుండాలి. పౌలు అపొస్తలుడైనప్పటికీ ఆయన 12 మందిలో ఒకడు కాదు.
-