నెహెమ్యా
7 ప్రాకారం తిరిగి కట్టబడగానే+ నేను తలుపుల్ని ఏర్పాటుచేశాను;+ ద్వారపాలకుల్ని,+ గాయకుల్ని,+ లేవీయుల్ని+ నియమించాను. 2 తర్వాత నా సహోదరుడైన హనానీని,+ కోట+ అధిపతైన హనన్యాని యెరూషలేము మీద నియమించాను. ఎందుకంటే, హనన్యా ఎంతో నమ్మకస్థుడు, ఎంతోమంది కన్నా సత్యదేవునికి ఎక్కువగా భయపడేవాడు.+ 3 నేను వాళ్లకు ఇలా చెప్పాను: “మధ్యాహ్నం ఎండ వచ్చేంతవరకు యెరూషలేము ద్వారాల్ని తెరవకూడదు, ద్వారపాలకులు కాపలాగా నిలబడి ఉన్నప్పుడే తలుపుల్ని మూసేసి, గడియ వేయాలి. యెరూషలేము నివాసుల్ని కాపలాగా నియమించాలి. వాళ్లలో ప్రతీ ఒక్కరు తమకు నియమించబడిన స్థానాల్లో తమ ఇంటికి ఎదురుగా కాపలా కాయాలి.” 4 ఇప్పుడు నగరం విశాలంగా, పెద్దగా ఉంది. దానిలో కొంతమంది ప్రజలే ఉన్నారు,+ ఇళ్లు ఇంకా తిరిగి కట్టబడలేదు.
5 కానీ ప్రముఖుల్ని, ఉప పాలకుల్ని, ప్రజల్ని సమకూర్చి వాళ్లను వంశాల ప్రకారం నమోదు చేయాలనే+ ఆలోచనను నా దేవుడు నా మనసులో పెట్టాడు. అప్పుడు నేను, మొదట వచ్చినవాళ్ల వంశావళుల వివరాలున్న గ్రంథాన్ని కనుగొన్నాను. అందులో నాకు ఈ వివరాలు కనిపించాయి:
6 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే. వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు+ చెరపట్టుకుపోయాడు,+ వీళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాకు, ప్రతీ ఒక్కరు తమతమ నగరాలకు తిరిగొచ్చారు,+ 7 వీళ్లు జెరుబ్బాబెలు,+ యేషూవ,+ నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనాతోపాటు వచ్చారు.
ఆ ఇశ్రాయేలు పురుషుల సంఖ్య ఇది:+ 8 పరోషు వంశస్థులు 2,172 మంది; 9 షెఫట్య వంశస్థులు 372 మంది; 10 ఆరహు వంశస్థులు 652 మంది; 11 పహత్మోయాబు+ వంశంలో యేషూవ, యోవాబు+ వంశస్థులు 2,818 మంది; 12 ఏలాము+ వంశస్థులు 1,254 మంది; 13 జత్తూ వంశస్థులు 845 మంది; 14 జక్కయి వంశస్థులు 760 మంది; 15 బిన్నూయి వంశస్థులు 648 మంది; 16 బేబై వంశస్థులు 628 మంది; 17 అజ్గాదు వంశస్థులు 2,322 మంది; 18 అదొనీకాము వంశస్థులు 667 మంది; 19 బిగ్వయి వంశస్థులు 2,067 మంది; 20 ఆదీను వంశస్థులు 655 మంది; 21 హిజ్కియా కుటుంబానికి చెందిన అటేరు వంశస్థులు 98 మంది; 22 హాషుము వంశస్థులు 328 మంది; 23 బెజయి వంశస్థులు 324 మంది; 24 హారీపు వంశస్థులు 112 మంది; 25 గిబియోను+ వంశస్థులు 95 మంది; 26 బేత్లెహేమువాళ్లు, నెటోపావాళ్లు 188 మంది; 27 అనాతోతువాళ్లు 128 మంది; 28 బేతజ్మావెతువాళ్లు 42 మంది; 29 కిర్యత్యారీము,+ కెఫీరా, బెయేరోతు నగరాలవాళ్లు 743 మంది; 30 రామా, గెబా నగరాలవాళ్లు 621 మంది; 31 మిక్మషువాళ్లు 122 మంది; 32 బేతేలు,+ హాయి నగరాలవాళ్లు 123 మంది; 33 ఇంకో నెబోవాళ్లు 52 మంది; 34 ఇంకో ఏలాము వంశస్థులు 1,254 మంది; 35 హారీము వంశస్థులు 320 మంది; 36 యెరికోవాళ్లు 345 మంది; 37 లోదు, హాదీదు, ఓనో వంశస్థులు 721 మంది; 38 సెనాయా వంశస్థులు 3,930 మంది.
39 యాజకులు:+ యేషూవ కుటుంబానికి చెందిన యెదాయా వంశస్థులు 973 మంది; 40 ఇమ్మేరు వంశస్థులు 1,052 మంది; 41 పషూరు+ వంశస్థులు 1,247 మంది; 42 హారీము+ వంశస్థులు 1,017 మంది.
43 లేవీయులు:+ హోదెవా వంశంలో యేషూవ, కద్మీయేలు+ వంశస్థులు 74 మంది. 44 గాయకులు:+ ఆసాపు+ వంశస్థులు 148 మంది. 45 ద్వారపాలకులు:+ షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు+ వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు; మొత్తం 138 మంది.
46 ఆలయ సేవకులు:*+ జీహా, హశూపా, టబ్బాయోతు వంశస్థులు, 47 కేరోసు, సీయహా, పాదోను వంశస్థులు, 48 లెబానా, హగాబా, షల్మయి వంశస్థులు, 49 హానాను, గిద్దేలు, గహరు వంశస్థులు, 50 రెవాయా, రెజీను, నెకోదా వంశస్థులు, 51 గజ్జాము, ఉజ్జా, పాసెయ వంశస్థులు, 52 బేసాయి, మెయోనీం, నెపూషేసీము* వంశస్థులు, 53 బక్బూకు, హకూపా, హర్హూరు వంశస్థులు, 54 బజ్లీతు, మెహీదా, హర్షా వంశస్థులు, 55 బర్కోసు, సీసెరా, తెమహు వంశస్థులు, 56 నెజీయహు, హటీపా వంశస్థులు.
57 సొలొమోను సేవకుల వంశస్థులు:+ సొటయి, సోపెరెతు, పెరూదా వంశస్థులు, 58 యహలా, దర్కోను, గిద్దేలు వంశస్థులు, 59 షెఫట్య, హట్టీలు, పొకెరెతు హజెబాయీము, ఆమోను వంశస్థులు. 60 ఆలయ సేవకులు,*+ సొలొమోను సేవకుల వంశస్థులు మొత్తం 392 మంది.
61 తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు నుండి వచ్చినవాళ్లు తాము ఏ పూర్వీకుల కుటుంబానికి చెందినవాళ్లో రుజువు చేసుకోలేకపోయారు; వాళ్లు ఇశ్రాయేలీయులని నిరూపించుకోలేకపోయారు. వాళ్లు ఎవరంటే:+ 62 దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు; మొత్తం 642 మంది. 63 యాజకుల్లో: హబాయ్యా వంశస్థులు, హక్కోజు+ వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు. ఈ బర్జిల్లయి, గిలాదీయుడైన బర్జిల్లయి+ కూతుళ్లలో ఒకర్ని పెళ్లిచేసుకున్నాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. 64 వీళ్లు తమ వంశావళిని నిర్ధారించుకోవడానికి తమ కుటుంబాల పేర్లను గ్రంథాల్లో వెతికారు, కానీ అవి కనిపించలేదు. దాంతో వాళ్లు యాజకత్వానికి అనర్హులయ్యారు.*+ 65 ఊరీము, తుమ్మీము+ సహాయంతో సంప్రదించే ఒక యాజకుడు వచ్చేవరకు వాళ్లు అతి పవిత్రమైన వాటిని+ తినకూడదని అధిపతి*+ వాళ్లకు చెప్పాడు.
66 సమాజం మొత్తం 42,360 మంది.+ 67 వాళ్లతోపాటు 7,337 మంది దాసులు, దాసురాళ్లు;+ 245 మంది గాయనీ గాయకులు+ కూడా ఉన్నారు. 68 వాళ్ల దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 69 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
70 పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో కొంతమంది పనికోసం విరాళాలు ఇచ్చారు.+ అధిపతి* 1,000 బంగారు డ్రక్మాలు,* 50 గిన్నెలు, యాజకులు ధరించే 530 పొడవాటి అంగీలు+ ధనాగారానికి ఇచ్చాడు. 71 పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో కొంతమంది నిర్మాణానికి సంబంధించిన ధనాగారానికి 20,000 బంగారు డ్రక్మాలు, 2,200 వెండి మినాలు* ఇచ్చారు. 72 మిగతా ప్రజలు 20,000 బంగారు డ్రక్మాలు, 2,000 వెండి మినాలు, యాజకులు ధరించే 67 పొడవాటి అంగీలు ఇచ్చారు.
73 యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు,+ కొంతమంది ప్రజలు, ఆలయ సేవకులు,* మిగతా ఇశ్రాయేలీయులందరూ తమతమ నగరాల్లో స్థిరపడ్డారు.+ ఏడో నెల వచ్చేసరికి+ ఇశ్రాయేలీయులు తమ నగరాల్లో స్థిరపడ్డారు.+