దైవపరిపాలనా వార్తలు
కాంబోడియా: ఫిబ్రవరి 8 1993న, మన పని నిమిత్తం ఒక కార్యాలయాన్ని స్థాపించుటకు అనుమతి ఇస్తూ మరియు మిషనరీలు దేశములో ప్రవేశించుటకు మార్గాన్ని తెరుస్తూ ఒక అధికార పత్రం అందింది. కాంబోడియాలో 25కంటే ఎక్కువ సంవత్సరాల తరువాత, సువార్త తిరిగి బాహాటంగా ప్రకటించబడుచున్నందుకు మేము సంతోషిస్తున్నాము.
సైప్రస్: మార్చిలో, 1,462 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యతో పాటు, ఆ బ్రాంచి బైబిలు పఠనాలు, పునర్దర్శనాలు, మరియు గంటలలో కూడా శిఖరాగ్రాన్ని రిపోర్టు చేసింది.
లైబీరియా: మార్చిలో సహోదరులు బ్రాంచి కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న సంస్థ భూభాగములో “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశమును జరుపుకొన్నారు. హాజరైనవారి శిఖరాగ్ర సంఖ్య 2,711, మరియు 78 మంది బాప్తిస్మము పొందారు.
జపాన్: మార్చిలో వారు 1,77,591 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను పొందారు.
ఫిలిప్పైన్స్: మార్చిలో వారు 1,15,044 మంది ప్రచారకులతో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకొన్నారు.