దైవపరిపాలనా వార్తలు
◆ బార్బడోస్ సెప్టెంబరులో నూతన శిఖరముగా 1,800 ప్రచారకులను కలిగియుండెను.
◆ కోట్ డి’ఐవరి తన నూతన సేవాసంవత్సరమును 3,465 ప్రచారకులతో వరుసగా తన 12వ నూతన శిఖరముతో ప్రారంభించినది. అచ్చటయున్న సహోదరులు లైబీరియాలో యుద్ధమువలన తలెత్తియున్న కష్టపరిస్థితులనుబట్టి తమయొద్దకు శరణార్థులుగా వచ్చియున్న సహోదర సహోదరీలకు సహాయము చేయుచున్నారు.
◆ సెప్టెంబరు మాసమునకు జపాన్లోని ప్రచారకుల నూతన శిఖరము 1,48,452యై యుండెను. సెప్టెంబరు మాస ప్రారంభములో 3,582 మంది క్రొత్తగా రెగ్యులర్ పయినీర్లుగా లెక్కలో చేరిరి. సెప్టెంబరు మాసములో 111 సర్క్యూట్లందు జరిగిన పయినీర్ పాఠశాలయొక్క 165 తరగతులందు 3,920 మంది రెగ్యులర్ పయినీర్లు పాల్గొని అందలి శిక్షణను ఆనందించిరి.
◆ సెప్టెంబరు మాసములో కెన్యా 5,610 మంది ప్రచారకుల నూతన శిఖరమును కలిగియున్నది. ప్రత్యేక సమావేశ దిన పరంపరలో అన్నిటికి కలిపి హాజరైనవారి మొత్తము సంఖ్య 11,027. 172 మంది బాప్తిస్మము తీసుకొనిరి.
◆ సెప్టెంబరులో లెసెతో 1,347 మంది ప్రచారకుల నూతన శిఖరమును కలిగియుండెను. సంఘప్రచారకుల సగటు 13.1 గంటలు వారు యెహోవా సేవలో తమకై తాము పోరాడుతున్నారని సూచించుచున్నది.
◆ మారిషియస్ సెప్టెంబరు మాసములో 907 మంది ప్రచారకుల నూతన శిఖరమును కలిగియున్నది.
◆ సెప్టెంబరు మాసములో నైజీరియా 1,46,703 ప్రచారకుల నూతన శిఖరమును కలిగియుండెను. ఇది ఆగస్టు మాసపు శిఖరము కంటె 4,600 మంది ప్రచారకులు ఎక్కువ.
◆ రీయూనియన్ 1,854 మంది ప్రచారకుల నూతన శిఖరమును కలిగియున్నది. వారి సమావేశమునకు 3,591 మంది హాజరుకాగా 114 మంది బాప్తిస్మము పొందారు.
◆ సెయింట్ విన్సెంట్ సెప్టెంబరులో 208 మంది ప్రచారకులను కలిగియున్నది. సంఘ ప్రచారకులు సగటున 14.2 గంటలను కలిగియుండిరి.