కీర్తనలు
ఆసాపు+ శ్రావ్యగీతం.
79 దేవా, దేశాలు నీ స్వాస్థ్యంలోకి+ చొరబడ్డాయి;
వాళ్లు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపర్చారు;+
యెరూషలేమును శిథిలాల కుప్పగా మార్చారు.+
2 వాళ్లు నీ సేవకుల శవాల్ని ఆకాశపక్షులకు,
నీ విశ్వసనీయుల శరీరాల్ని భూమ్మీది అడవి జంతువులకు ఆహారంగా వేశారు.+
3 వాళ్ల రక్తాన్ని యెరూషలేము చుట్టూ నీళ్లలా పారబోశారు,
వాళ్లను పాతిపెట్టడానికి ఎవరూ మిగల్లేదు.+
4 మేము మా పొరుగువాళ్ల దృష్టికి నీచంగా ఉన్నాం;+
మా చుట్టూ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు.
5 యెహోవా, ఎంతకాలం నువ్వు కోపంగా ఉంటావు? ఎప్పటికీనా?+
ఎంతకాలం నీ ఉగ్రత అగ్నిలా మండుతుంది?+
6 నువ్వు ఎవరో తెలియని దేశాల మీద,
నీ పేరున ప్రార్థించని రాజ్యాల మీద నీ ఉగ్రతను కుమ్మరించు.
7 ఎందుకంటే వాళ్లు యాకోబును మింగేశారు,
అతని స్వదేశాన్ని నిర్మానుష్యం చేశారు.+
8 మా పూర్వీకుల తప్పుల్ని+ బట్టి మమ్మల్ని శిక్షించకు.
త్వరగా మామీద కరుణ చూపించు,+
మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.
9 మా రక్షకుడివైన దేవా,
మహిమగల నీ పేరును బట్టి మాకు సహాయం చేయి;
10 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని దేశాలు ఎందుకు అనాలి?
చిందించబడిన నీ సేవకుల రక్తం విషయంలో
ప్రతీకారం తీర్చుకోబడిందని దేశాలు తెలుసుకోవాలి, అది మేము కళ్లారా చూడాలి.+
11 చెరలో ఉన్న వాళ్ల నిట్టూర్పులు నువ్వు వినాలి.+
మరణశిక్ష విధించబడిన వాళ్లను* నువ్వు నీ గొప్ప శక్తితో* కాపాడు.*