ద్వితీయోపదేశకాండం
32 “ఆకాశమా, విను, నేను మాట్లాడతాను;
భూమీ, నా నోటి మాటలు విను.
2 నా ఉపదేశం వానలా కురుస్తుంది;
నా మాటలు మంచు బిందువుల్లా,
గడ్డిమీద కురిసే జల్లులా,
పచ్చిక మీద పడే వర్షంలా ఉంటాయి.
3 నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.+
మన దేవుని గొప్పతనం గురించి చెప్తాను!+
5 కానీ వాళ్లే చెడుగా ప్రవర్తించారు.+
వాళ్లు ఆయన పిల్లలు కాదు, తప్పు వాళ్లదే.+
వాళ్లు కుటిలమైన, వక్రమైన తరం!+
6 మూర్ఖులారా, తెలివితక్కువ ప్రజలారా,
మీరు యెహోవాతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా?+
ఆయన మిమ్మల్ని ఉనికిలోకి తీసుకొచ్చిన మీ తండ్రి కాదా?+
మిమ్మల్ని సృష్టించి, దృఢంగా స్థాపించింది ఆయన కాదా?
7 పాత రోజుల్ని గుర్తుచేసుకోండి;
గడిచిన తరాల సంవత్సరాల గురించి ఆలోచించండి.
మీ నాన్నను అడగండి, అతను మీకు చెప్తాడు;+
మీ పెద్దల్ని అడగండి, వాళ్లు మీకు తెలియజేస్తారు.
8 సర్వోన్నతుడు జనాలకు స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు,+
ఆదాము కుమారుల్ని* ఒకరి నుండి ఒకర్ని వేరుచేసినప్పుడు,+
ఇశ్రాయేలీయుల సంఖ్యను బట్టి
ఆయన జనాల సరిహద్దును నిర్ణయించాడు.+
11 గద్ద తన గూడును కుదిపి,
తన పిల్లలకు పైన ఎగురుతూ,
రెక్కలు చాచి, వాటిని తీసుకొని,
తన రెక్కల మీద మోసినట్టు,+
12 యెహోవా ఒక్కడే అతన్ని* నడిపిస్తూ వచ్చాడు;+
వేరే ఏ దేవుడూ అతనితో లేడు.+
13 ఆయన అతన్ని భూమ్మీది ఎత్తైన స్థలాల్ని జయించేలా చేశాడు,+
దానివల్ల అతను పొలం పంటను తిన్నాడు.
ఆయన అతన్ని బండ నుండి వచ్చిన తేనెతో పోషించాడు,
చెకుముకి రాయి నుండి వచ్చిన నూనెతో,
14 పశువుల వెన్నతో, మంద పాలతో,
అతి శ్రేష్ఠమైన గొర్రెలతో,
బాషాను పొట్టేళ్లతో, మేకపోతులతో,
శ్రేష్ఠమైన గోధుమలతో అతన్ని పోషించాడు;+
అతను ద్రాక్షారసం తాగాడు.
15 యెషూరూను* లావైనప్పుడు, ఎదురుతిరిగి కాలు జాడించాడు.
అతను కొవ్వుపట్టి, బలిసి, మందంగా తయారయ్యాడు.+
16 వాళ్లు వేరే దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు,+
అసహ్యమైన పనులు చేస్తూ ఆయనకు కోపం తెప్పించారు.+
17 వాళ్లు దేవునికి కాదు, చెడ్డదూతలకు* బలులు అర్పించారు,+
వాళ్లకు అప్పటివరకు తెలియని దేవుళ్లకు,
ఈమధ్యే పుట్టుకొచ్చిన కొత్త దేవుళ్లకు,
వాళ్ల పూర్వీకులకు తెలియని దేవుళ్లకు బలులు అర్పిస్తూ వచ్చారు.
19 అది చూసినప్పుడు యెహోవా వాళ్లను తిరస్కరించాడు,+
ఎందుకంటే తన కుమారులు, కూతుళ్లు ఆయనకు కోపం తెప్పించారు.
20 కాబట్టి ఆయన ఇలా అన్నాడు: ‘నేను వాళ్లకు కనిపించకుండా నా ముఖాన్ని దాచుకుంటాను;+
వాళ్ల సంగతి ఏమౌతుందో చూస్తాను.
21 వాళ్లు దేవుడుకాని దాన్ని పూజించి నాకు రోషం పుట్టించారు;+
వాళ్ల వ్యర్థమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు.+
కాబట్టి నేను కూడా జనంకాని దాన్ని ఉపయోగించి వాళ్లకు రోషం పుట్టిస్తాను;+
మూర్ఖమైన జనంతో వాళ్లకు కోపం తెప్పిస్తాను.+
22 ఎందుకంటే, నా కోపం అగ్ని రాజేసింది,+
అది సమాధి* లోతుల వరకు మండుతుంది,+
భూమిని, దాని పంటను దహించేస్తుంది,
పర్వతాల పునాదుల్ని రగిలిస్తుంది.
23 నేను వాళ్లమీదికి ఇంకా ఎక్కువ విపత్తులు రప్పిస్తాను;
నా బాణాలన్నీ వాళ్లమీద ప్రయోగిస్తాను.
25 బయటేమో ఖడ్గం వాళ్లను చంపుతుంది;+
లోపలేమో భయం వాళ్లను చుట్టుముడుతుంది,+
యువకులు, కన్యలు,
పసిపిల్లలు, తలనెరసిన వాళ్లు, అందరి పరిస్థితి అలాగే ఉంటుంది.+
26 నేను ఇలా అని ఉండేవాణ్ణే: “నేను వాళ్లను చెదరగొడతాను;
మనుషుల మధ్య వాళ్ల జ్ఞాపకమనేదే లేకుండా చేస్తాను,”
27 అయితే శత్రువులు దాన్ని తప్పుగా అర్థంచేసుకొని,+
“మా సొంత శక్తితోనే గెలిచాం; ఇదంతా చేసింది యెహోవా కాదు”
28 వాళ్లు తెలివిలేని* జనం,
వాళ్లకు అవగాహనే లేదు.
29 వాళ్లకే గనుక తెలివి ఉంటే ఎంత బాగుండేది!+ అప్పుడు వాళ్లు దీని గురించి ధ్యానించేవాళ్లు.+
తమకు ఏమౌతుందో ఆలోచించేవాళ్లు.+
30 ఒక్క వ్యక్తి 1,000 మందిని ఎలా తరమగలడు?
ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని ఎలా పారిపోయేట్టు చేయగలరు?+
32 వాళ్ల ద్రాక్షతీగ సొదొమ నుండి,
గొమొర్రా పొలాల నుండి వచ్చింది.+
వాళ్ల ద్రాక్షపండ్లు విషపూరితమైనవి,
వాళ్ల ద్రాక్షగుత్తులు చేదైనవి.+
33 వాళ్ల ద్రాక్షారసం పాముల విషం,
అది తాచుపాముల క్రూర విషం.
34 నేను వాళ్ల పనులన్నిటికీ ముద్రవేసి,
వాటిని నా గోదాములో భద్రంచేశాను.+
35 పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని,+
నియమిత సమయంలో వాళ్ల కాలు జారినప్పుడు+ నేను చర్య తీసుకుంటాను,
వాళ్లమీదికి విపత్తు వచ్చే రోజు దగ్గరపడింది,
వాళ్లమీదికి రావాల్సింది చాలా త్వరగా వస్తుంది.’
36 యెహోవా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు,+
తన సేవకుల బలం క్షీణించిపోవడం,
నిస్సహాయులు, బలహీనులు మాత్రమే మిగిలివుండడం చూసి,
37 అప్పుడు ఆయన ఇలా అంటాడు: ‘వాళ్ల దేవుళ్లు ఎక్కడ?+
వాళ్లు నమ్ముకున్న ఆశ్రయదుర్గం* ఎక్కడ?
38 ఆ దేవుళ్లు వాళ్ల బలుల కొవ్వును* తినేవాళ్లు,
వాళ్ల పానీయార్పణల ద్రాక్షారసం తాగేవాళ్లు.+
ఆ దేవుళ్లనే లేచివచ్చి మీకు సహాయం చేయనివ్వండి.
వాళ్లనే మీ ఆశ్రయ స్థలం కానివ్వండి.
చంపేవాణ్ణి నేనే, బ్రతికించేవాణ్ణి నేనే.+
40 ఎందుకంటే నేను ఆకాశం వైపు నా చెయ్యి ఎత్తి,
“అంతంలేని నా జీవంతోడు” అని ప్రమాణం చేస్తాను.+
41 నేను మెరిసే నా ఖడ్గాన్ని సానబెట్టినప్పుడు,
తీర్పుతీర్చడానికి నా చేతిని సిద్ధం చేసినప్పుడు,+
నేను నా శత్రువుల మీద పగతీర్చుకుంటాను,+
నన్ను ద్వేషించేవాళ్లకు ప్రతిఫలం ఇస్తాను.
42 నేను హతుల రక్తంతో, బందీల రక్తంతో
నా బాణాలను మత్తిల్లజేస్తాను,
నా ఖడ్గం మాంసం తింటుంది,
అది నా శత్రువుల నాయకుల తలల్ని తింటుంది.’
43 దేశాల్లారా, ఆయన ప్రజలతో సంతోషించండి,+
తన సేవకుల రక్తం విషయంలో ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు,+
ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు,+
తన ప్రజల దేశానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు.”*
44 అలా మోషే, నూను కుమారుడైన హోషేయ*+ వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని మాటలన్నిటినీ చెప్పారు.+ 45 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలన్నీ చెప్పడం పూర్తయ్యాక, 46 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ జాగ్రత్తగా పాటించమని మీరు మీ కుమారులకు ఆజ్ఞాపించేలా,+ నేడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ చెప్తున్న ఈ మాటలన్నిటినీ మీ మనసులో ఉంచుకోండి.+ 47 ఎందుకంటే ఇది మీకు వట్టి మాట కాదు, ఇది మీకు జీవం;+ ఈ మాటను పాటించడం వల్ల మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో చాలాకాలం జీవిస్తారు.”
48 అదే రోజున యెహోవా మోషేతో మాట్లాడి ఇలా అన్నాడు: 49 “నువ్వు మోయాబు దేశంలో యెరికో ఎదురుగా ఉన్న అబారీము కొండ మీదికి+ అంటే నెబో కొండ మీదికి వెళ్లి,+ నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న కనాను దేశాన్ని+ చూడు. 50 తర్వాత, నీ అన్న అహరోను హోరు కొండమీద చనిపోయి+ తన ప్రజల దగ్గరికి చేర్చబడినట్టే,* నువ్వు కూడా అక్కడ, అంటే నువ్వు ఎక్కబోతున్న ఆ కొండమీద చనిపోయి, నీ ప్రజల దగ్గరికి చేర్చబడతావు. 51 ఎందుకంటే మీరిద్దరూ సీను ఎడారిలో కాదేషుకు చెందిన మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల మధ్య నాకు నమ్మకంగా ఉండలేదు,+ ఇశ్రాయేలు ప్రజల ముందు నన్ను పవిత్రపర్చలేదు.+ 52 నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశాన్ని నువ్వు దూరం నుండి చూస్తావు, కానీ నువ్వు అందులో అడుగుపెట్టవు.”+