కీర్తనలు
2 యెహోవా శక్తివంతమైన పనుల్ని ఎవరు పూర్తిగా ప్రకటించగలరు?
స్తుతిపాత్రమైన ఆయన కార్యాలన్నిటినీ ఎవరు చాటించగలరు?+
4 యెహోవా, నీ ప్రజల మీద దయ చూపించేటప్పుడు నన్ను గుర్తుచేసుకో.+
నీ రక్షణ కార్యాలతో నన్ను ఆదుకో.
5 అప్పుడు, నువ్వు ఎంచుకున్నవాళ్ల+ పట్ల నువ్వు చూపించే మంచితనాన్ని నేను ఆస్వాదిస్తాను,
నీ ప్రజలతో పాటు సంతోషిస్తాను,
నీ స్వాస్థ్యంతో పాటు గర్వంగా నిన్ను స్తుతిస్తాను.*
7 మా పూర్వీకులు నీ అద్భుతమైన పనుల పట్ల కృతజ్ఞత చూపించలేదు.*
నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను గుర్తుచేసుకోలేదు,
సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వాళ్లు తిరుగుబాటు చేశారు.
9 ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించినప్పుడు అది ఎండిపోయింది;
ఎడారి గుండా నడిపించినట్టు ఆయన దాని లోతైన స్థలాల గుండా వాళ్లను నడిపించాడు.
10 వాళ్ల శత్రువు చేతిలో నుండి ఆయన వాళ్లను రక్షించాడు,
విరోధి చేతిలో నుండి వాళ్లను విడిపించాడు.+
13 కానీ వాళ్లు ఆయన చేసినవాటిని త్వరగా మర్చిపోయారు;+
ఆయన సలహా కోసం వేచి చూడలేదు.
15 వాళ్లు అడిగింది ఆయన వాళ్లకు ఇచ్చాడు,
కానీ తర్వాత వ్యాధితో శిక్షించి వాళ్లను నాశనం చేశాడు.+
17 అప్పుడు భూమి నోరు తెరిచి దాతానును మింగేసింది,
అబీరాము గుంపును కప్పేసింది.+
18 వాళ్ల గుంపులో అగ్ని రగులుకుంది;
అగ్నిజ్వాల దుష్టుల్ని దహించేసింది.+
19 హోరేబులో వాళ్లు దూడను చేసుకున్నారు,
పోత* విగ్రహానికి వంగి నమస్కారం చేశారు.+
20 వాళ్లు నా మహిమను
గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారు.+
21 తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు;
ఐగుప్తులో గొప్ప కార్యాలు,+
22 హాము దేశంలో అద్భుతమైన పనులు,+
ఎర్రసముద్రం దగ్గర సంభ్రమాశ్చర్యాలు పుట్టించే పనులు+ చేసిన దేవుణ్ణి మర్చిపోయారు.
23 ఆయన వాళ్లను సమూలంగా నాశనం చేయమని ఆజ్ఞాపించేవాడే,
కానీ ఆయన ఎంచుకున్న మోషే ఆయన్ని వేడుకున్నాడు,
నాశనం చేసే ఆయన కోపాన్ని పక్కకు మళ్లించాడు.+
24 వాళ్లు మనోహరమైన దేశాన్ని నీచంగా చూశారు;+
ఆయన వాగ్దానం మీద వాళ్లకు విశ్వాసం లేదు.
26 కాబట్టి ఆయన తన చెయ్యి ఎత్తి వాళ్ల గురించి ఒట్టేశాడు;
వాళ్లు ఎడారిలో చనిపోయేలా చేస్తానని,+
27 వాళ్ల వంశస్థులు దేశాల మధ్య చనిపోయేలా చేస్తానని,
వాళ్లను దేశదేశాలకు చెదరగొడతానని అన్నాడు.+
28 తర్వాత వాళ్లు పెయోరులో ఉన్న బయలును పూజించడం మొదలుపెట్టారు,*+
చనిపోయినవాళ్లకు అర్పించిన బలుల్ని* తిన్నారు.
30 అయితే ఫీనెహాసు లేచి, చర్య తీసుకున్నప్పుడు
తెగులు ఆగిపోయింది.+
38 వాళ్లు అమాయకుల రక్తాన్ని,
తమ సొంత కుమారుల, కూతుళ్ల రక్తాన్ని చిందిస్తూ వచ్చారు;+
వాళ్లను కనాను విగ్రహాలకు బలి అర్పించారు.+
రక్తపాతం వల్ల దేశం కలుషితమైపోయింది.
40 కాబట్టి యెహోవా కోపం తన ప్రజల మీద రగులుకుంది,
ఆయనకు తన స్వాస్థ్యం మీద అసహ్యం వేసింది.
41 దాంతో ఆయన, వాళ్లను ద్వేషించే ప్రజలు వాళ్లను పరిపాలించేలా+
పదేపదే వాళ్లను వేరే దేశాలకు అప్పగించాడు.+
42 వాళ్ల శత్రువులు వాళ్లను కష్టాలు పెట్టారు,
వాళ్లు తమ శత్రువులకు దాసోహమయ్యారు.
43 చాలాసార్లు ఆయన వాళ్లను విడిపించాడు,+
కానీ వాళ్లు ఎదురుతిరిగేవాళ్లు, మాట వినేవాళ్లు కాదు,+
దాంతో వాళ్లు తమ తప్పుల కారణంగా అవమానించబడేవాళ్లు.+
45 వాళ్ల కోసం ఆయన తన ఒప్పందాన్ని గుర్తుచేసుకునేవాడు,
46 వాళ్లు ఎవరి దగ్గర బందీలుగా ఉన్నారో
ఆ ప్రజలందరికీ వాళ్ల మీద జాలి పుట్టించేవాడు.+
47 యెహోవా, మా దేవా, మమ్మల్ని కాపాడు,+
దేశాల్లో నుండి మమ్మల్ని సమకూర్చు;+
అప్పుడు మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం,
ప్రజలంతా “ఆమేన్!”* అనాలి.